Month: May 2025

వడ్డాది పాపయ్య – భారతదేశ ప్రముఖ చిత్రకారుడు

భారతదేశానికి గర్వకారణమైన చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు శ్రీవడ్డాది పాపయ్య. పవిత్ర నాగావళీ నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం “కోదండ …

దూసి బెనర్జీ – కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌

దూసి బెనర్జీ  అసలు పేరు కూర్మనాధశర్మ, శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామం బహుముఖ ప్రజ్ఞాశాలి! రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్‌.. ఇవన్నీ కలబోసి పోతపోసిన బహుముఖ ప్రజ్ఞాశీలి దూసి బెనర్జీ. హరికథా కళారూపం పేరు చెప్పగానే గుర్తొచ్చేది బెనర్జీయే. కాగా మంచినటుడిగా సుకుమార్‌ ఆర్కెస్ట్రా నిర్వహకుడిగా తెలిసేది కొందరికే. 1948లో కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్రతో ప్రారంభమైన ఆయన నటజీవన ప్రస్థానం జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి (నటరాజ్‌ కళాసమితి), …

రోణంకి అప్పలస్వామి – సాహితీవేత్త , బహు భాషా కోవిదుడు

  రోణంకి అప్పలస్వామి టెక్కలిని  అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అప్పలస్వామిగారు శ్రీకాకుళంజిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జవరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15న  తండ్రి రోణంకి నారాయణ్ , తల్లి – రోణంకి చిట్టెమ్మ లకు జన్మించారు.. తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాలయాల్లో చదువులు పూర్తిచేసి   ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. తరువాత కాలంలో చదువుకున్న చోటే విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు …

పురిపండా అప్పలస్వామి – రచయిత, కవి,బహు భాషా కోవిదుడు,

పురిపండా అప్పలస్వామి 13 నవంబర్ 1904లో శ్రీకాకుళం జిల్లాలోని సాలూరులో జన్మిం చారు. గిడుగు రామమూర్తిగారి వ్యావహారికాంధ్రోద్యమ వారసుడు, బహుభాషా కోవిదుడు, రచయిత, కవి, సంఘసంస్కర్త, స్వాతంత్ర సమర యోధుడు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి పురిపండా. ఆంధ్ర, సంస్కృతాలలోనే గాక ఒరియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో సమధిక పాండిత్యాన్ని ఆర్జించారు. గాంధీజీ చేపట్టిన ఉద్యమాలలో సహాయ నిరాకరణ ఉద్యమం ,హరిజనోద్యమం, ఖాదీ ప్రచార ఉద్యమం ,భాషా ప్రచారం ఉద్యమాల్లో చురుగా పాల్గొన్నారు. విశాఖపట్నంలోని అఖిల భారత చరక సంఘంలో నిర్వాహకుడిగా కూడా పనిచేశారు. …

కరణం మల్లేశ్వరి

(1975 – ) మహిళా విభాగంలో ఒలింపిక్ క్రీడల్లో పతకం సాధించిన ఏకైక మహిళ కరణం మల్లీశ్వరి. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీపంలో  వూసవానిపేట  గ్రామంలో శ్యామల, కరణం మనోహర్లకు 1975లో జన్మించింది. వీరి తల్లిదండ్రులు చిత్తూర్ జిల్లాకు చెందినవారు ,ఈమె తండ్రి రైల్వే రక్షణ దళంలో ఉద్యోగి, కళాశాల స్థాయి ఫుట్బాల్  ఆటగాడు. ఈమె తన 12ఏట చదువు మానివేసింది. 15 సంవత్సరాల వయస్సులో తన అక్క నరసమ్మను చూడడానికి బెంగుళూరు …

తాపీ ధర్మారావు – తెలుగు రచయిత, గేయ రచయిత మరియు సంఘ సంస్కర్త

తాపీ ధర్మారావు నాయుడు తెలుగు రచయిత, గేయ రచయిత మరియు సంఘ సంస్కర్త కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును, మరెన్నో సాహిత్య అవార్డులను సంపాందించుకున్న తాపీ ధర్మారావు. ‘తాతాజీ’గా ముద్దుగా పిలుచుకునే ఈయన అందరికీ సుపరిచితులే. తాపీ ధర్మారావు శ్రీకాకుళంలోని ఒక గ్రామానికి చెందినవాడు మరియు సెప్టెంబర్ 19, 1887న బెర్హంపూర్‌లో జన్మించాడు. అతని తండ్రి థాపీ అప్పన్న నాయుడు ఒక వైద్యుడు మరియు తల్లి పేరు నరసమ్మ. వీరికి ఐదుగురు  సంతానం. అందులో ధర్మారావు రెండో సంతానం …

J V సోమయాజులు – ప్రముఖ సినీ, రంగస్థల నటుడు

    జొన్నలగడ్డ వెంకట సోమయాజులు  (1926 – 2004) శంకరాభరణం ‘శంకర శాస్త్రి’గా దేశ విదేశాలలో గౌరవ ప్రతిష్టలు పొందిన వీరు మొదట రంగస్థల నటుడు. శంకరాభరణం సినిమాలో  ‘శంకర శాస్త్రి’గా నటించి అందరి ప్రశంసలు పొందారు  దేని కారణంగా శంకరాభరణం సోమయాజులుగా , ‘శంకర శాస్త్రి’ పేర్లతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచస్తులు శ్రీకాకుళం జిల్లా లుకులాం అగ్రహారంలో 1928 జూలై 30న శారదాంబ, వెంకటశివరావు దంపతులకు జన్మించారు.  తల్లి శారదాంబ వీరిని ప్రోత్సహించింది.తండ్రి ప్రభుత్వ …

బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు నివసించిన వీరగెడ్డ రాజాం

శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్ర పాపారాయుడు పేరు ప్రస్తావించాల్సిందే. తాండ్ర పాపయ్య కోట రాజాంలో ఉండేది. విజయరామరాజు బొబ్బిలి కోటను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకోవడంతో కోటలోని అంతఃపుర స్త్రీలు అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకున్నారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న బొబ్బిలి రాణి తాండ్ర పాపారాయుడికి స్వయానా సోదరి. బొబ్బిలి పతనం తెలుసుకున్న తాండ్ర పాపయ్య రాజాం నుంచి హుటాహుటిన బొబ్బిలి వెళ్లి అక్కడ విజయరామరాజును చంపడం కూడా చారిత్రక ప్రసిద్ధమే. బొబ్బిలిపులి తాండ్ర …

History of Srikakulam -Before 1947

శతాబ్దాల చరిత-చిక్కోలు ఘనత ప్రాచీనకాలంలోనే శ్రీకాకుళం ఉందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. అయితే 1950లో జిల్లాలు ఏర్పడనంత వరకు ఈ ప్రాంతాన్ని కళింగ ప్రాంతంగా వ్యవహరించేవారు. కళింగ చరిత్ర ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, మహాభారతం, కథా సరిత్సాగరం, మొదలైన గ్రంథాలలో ప్రస్తావించారు. పూర్వదశలోనే ఈ ప్రాంతంలో ఆదిమ తెగలతో కూడుకున్న జనజీవనం ఉన్నట్టుగా కంభంపాటి సత్యనారాయణ ఆంధ్రుల సంస్కృతి-చరిత్రలో పేర్కొన్నారు. శబ్దకల్ప ద్రుమంలో కలి+గయ్‌+డ అని కళింగ ఉత్పత్తి పేర్కొన్నారు. వివాదాలు జరిగే ప్రదేశాలు కనుక దీనికి ‘కళింగ’ …

History of Srikakulam

This region of Andhra Pradesh was part of Kalinga region at first and later a part of Gajapati kingdom of Orissa up to mediaeval period.It was in the ‘Kutubshahi’ ruling in 1687 Srikakulam (Gulshanabad) was a village and formed as fauzdhari-center for their money transactions for the areas of Srikakulam, Vizianagaram, Vishakhapatnam, and some parts …